నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 20:03

Nikhat Zareen: నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌.. వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌!

దిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌(wWBC)లో భారత్‌ స్వర్ణాల పంట పండిస్తోంది. ఇప్పటికే రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్న భారత్..

తాజాగా మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. 50 కిలోల విభాగంలో తెలంగాణ సంచలనం నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen) పసిడి కొల్లగొట్టింది.

ప్రత్యర్థి, రెండు సార్లు అసియా ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్న వియత్నాంకు చెందిన గుయెన్‌ టాన్‌పై 5-0తో విజయం సాధించింది. నిఖత్‌ జరీన్‌ వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అదరగొట్టింది..

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 20:01

Planes Almost Collide: గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...తృటిలో...

న్యూఢిల్లీ: తృటిలో గగనతలంలో భారీ ప్రమాదం తప్పింది. రెండు విమానాలు గాలిలోనే ఢీకొనబోయి సకాలంలో రాడార్ హెచ్చరిక సంకేతాలతో తప్పించుకున్నాయి..

దీంతో గగనతలంలో భారీ ప్రమాదం తప్పినట్టయింది. సంఘటన వివరాల ప్రకారం, నేపాల్ ఎయిర్‌లైన్స్‌ (Nepal Airlines)కు చెందిన ఎయిర్‌బస్ A-320 కౌలాలంపూర్ నుంచి ఖాట్మండూ వస్తుండగా, ఎయిర్ ఇండియా (Air India) విమానం న్యూఢిల్లీ నుంచి ఖాట్మండూ వస్తోంది. రెండూ దాదాపు దగ్గరగా వచ్చాయి. ఆ సమయంలో ఎయిర్ ఇండియా విమానం 19 వేల అడుగుల ఎత్తునుంచి కిందకు దిగుతోంది. నేపాల్ ఎయిర్ లైన్స్ విమానం అదే ప్రదేశంలో 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. దీనిపై రాడార్ సంకేతాలు ఇవ్వడంతో ఇరు విమానాల పైలట్లు అప్రమత్తమయ్యారు. నేపాల్ విమానం వెంటనే ఏడు వేల అడుగులకు దిగడంతో ప్రమాదం తప్పిందని నేపాల్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కాగా, ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని నేపాల్ పౌర విమానయాన సంస్థ ఏర్పాటు చేసింది. ఘటనా సమయంలో కంట్రోల్ రూమ్ ఇన్‌చార్జులుగా ఉన్న ముగ్గురు అధికారులపై సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ (CANN) సస్పె్న్షన్ వేటు వేసింది. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిపై చర్య తీసుకున్నట్టు సీఏఏఎన్ ప్రతినిధి ఒక ట్వీట్‌లో తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 17:01

కర్ణాటకలోని బసవ కళ్యాణ్ సభకు ఏపీ మిథున్ రెడ్డి

•బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి కార్యక్రమానికి హాజరు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కర్నాటకలో పర్యటించారు. బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ తాలుకాలోని గోర్ట గ్రామంలో నిజాంపై పోరాడిన అమరవీరుల స్థూపాన్ని, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహన్ని ఆవిష్కరించనున్నారని ఏపీ మిథున్ రెడ్డి తెలిపారు.

1948లో ఈ గ్రామంలో రజా కార్లు 200 మందిని ఊచకోత కోసారని, దీన్ని జలియన్ వాలా బాగ్ ఘటనతో అక్క డి పబ్లిక్ పోలుస్తుంటారని ఆన్నారు. బీజేపీ కార్య కర్తలు, అభిమానులు హాజరై అమిత్ షా ప్రో గ్రాంను సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణు లను బీజేపీ స్టేట్ చీఫ్​ సంజయ్ సూచించారని, ఆయన పిలుపును అందుకొని నేడు ఆయన వెంట కార్యక్రమానికి తరలి వెళ్ళినట్టు మిథున్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లంకల దీపక్, గడిల శ్రీకాంత్, గోపి, అనిల్, సంగప్ప, బూనేటి కిరణ్, తోకల శ్రీనివాస్, సుధాకర్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 17:03

కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్..

 •కొడుకుతో కలిసి చేరుతున్నట్టు ప్రకటన 

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీల్‌చైర్‌లో గాంధీభవన్‌కు వచ్చిన డీఎస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ లో తిరిగి చేరుతుండటం ఎంతో ఆనందంగా ఉందని, సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని అన్నారు. తన పెద్దకొడుకు ధర్మపురి సంజయ్‌తో కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే మరో నేత మేడ్చల్ సత్యనారాయణ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు డీఎస్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీఎస్‌కు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, రేణుకా చౌదరి, ఇతర ముఖ్య నేతలు పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి.హెచ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేణుకా చౌదరి, స్థానిక నేతలు దీక్ష చేపట్టారు. సాయంత్రం 5గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది..

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 16:40

హారీశ్‌ శంకర్‌ గంటన్నర బతిమలాడారు!

పవన్‌కల్యాణ్‌ సినిమాలో తనను విలన్‌గా నటించమని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కోరారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆ పాత్ర కోసం తనని గంటన్నరసేపు బతిమలాడినా అంగీకరించలేదని ఆయన అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘మేమ్‌ ఫేమస్‌’ టీజర్‌ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘మద్యపానం, ధూమపానం, పబ్‌లకు తిరగడం, డ్రగ్స్‌ తీసుకోవడం, షికార్లు చేయడం, అమ్మాయి వెంట పడడం లాంటివి చేస్తే ఎవరూ ఫేమస్‌ కారు. ఎదగాలంటే కష్టపడాలి. నేను ఎదగాడానికి ఎన్నో చేశా. పాలు అమ్మిన, పూలమ్మిన.. కాలేజీలు పెట్టా, వాటి ద్వారి టాప్‌ డాక్టర్లను, సైంటిస్టులను, ఇంజనీర్‌లను తయారు చేశాను.. అదీ ఫేమస్‌ కావడం అంటే. యువత కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు.

ఒకప్పటితో పోల్చితే నేటితరం యువతకు అవకాశాలు ఎక్కువ ప్లానింగ్‌ పర్ఫెక్ట్‌గా ఉండాలంటే. ఎవరికీ సక్సెస్‌కు షార్ట్‌ కట్‌ లేదు. ఈ సినిమా టీజర్‌ బావుంది. సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా ఈ హీరోతో నేనొక సినిమా చేస్తా. ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణ యాసలో ఏడాదికి నాలుగు చిత్రాలు నిర్మిస్తా. అంతా తెలంగాణా మోడల్‌లోనే! ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో సినిమా తీస్తున్న దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మా ఇంటికి వచ్చాడు. ఆ సినిమాలో విలన్‌గా చేయమని గంటన్నర బతిమిలాడాడు. నేను చేయనని చెప్పాను’’ అని అన్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 14:28

ప్రజా పోరాట యోధుల త్యాగం వెలకట్టలేనిది.. ధర్మ బిక్షం,సాంబశివుని పోరాట స్పూర్తి ని కొనసాగిస్తాం..

•పందుల సైదులు తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు

కామ్రేడ్ కొనపురి సాంబశివుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మ బిక్షం గార్ల జీవిత పోరాటం ఆదర్శనీయమైనదని,వారు గొప్ప ప్రజా పోరాట యోధులని వారి త్యాగం వెలకట్టలేనిదని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు.

కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం,సాంబశివుని వర్థంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక, బిసి విద్యార్థి సంఘం బీసీ యువజన సంఘం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పందుల సైదులు, ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ఇరువురు కూడా భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం, పోరాడిన వారే అన్నారు.నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న గొప్ప యోధుడు ధర్మభిక్షం అన్నారు.'దున్నేవాడికే భూమి'తోపాటు'గీసే వానికే చెట్టు' నినాదమిచ్చి గీత కార్మికుల సంక్షేమానికి కృషిచేసిన వారిలో మొదటివారు ధర్మబిక్షమన్నారు.కొనపురి సాంబశివుడు అజ్ఞాతంలో ఉన్నా ప్రజాక్షేత్రంలో ఉన్నా నిరంతరం పేద ప్రజల జీవితాల మార్పుల కోసమే పరితపించాడని వారన్నారు.గొప్ప పోరాట పటిమ కలిగిన సాంబశివుని ప్రభుత్వం కాపాడుకోలేకపోయిందన్నారు. నేటికి సాంబశివుని హత్య చేసిన హంతకులు ఎవరో తేల్చలేక పోయిందన్నారు.సమాజంలో బడుగు బలహీన వర్గాల నాయకుల పట్ల వివక్షత కొనసాగుతుందన్నారు.సాంబశివుని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని డిమాండ్ చేశారు.

మూడుసార్లు శాసనసభ్యుడిగా రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు వారు అందించిన సేవలు వెలకట్టలేనంతవి అన్నారు.బొమ్మగాని ధర్మం బిక్షం గారి పేరు సూర్యాపేట జిల్లాకు పెట్టాలని,వారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పొందుపరచాలని, ట్యాంక్ బండి పై వారి విగ్రహాన్ని ప్రతిష్టించాలని, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నీరా ప్రాజెక్టుకు ధర్మభిక్షం గారి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా నాయకులు నర్సింగ్ మురళీధర్ గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగం నరేష్ గౌడ్, చెనగోని నగేష్ గౌడ్, విజయ్, రాము గౌడ్ ,మహేష్ గౌడ్, హరికృష్ణ గౌడ్,అశోక్ గౌడ్, వెంకన్న గౌడ్ ,నరసింహ, లక్ష్మీనారాయణ ,విజయ్ ,తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 13:24

Covid-19: దేశంలో కరోనా విజృంభణ.. 5 నెలల గరిష్టానికి రోజువారీ కేసులు..

Covid-19: దేశంలో కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేసుల సంఖ్య కేవలం వందల్లోనే ఉండేది..

కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తాజాగా 5 నెలల గరిష్టానికి రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1,890 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు, కేరళలో ముగ్గురు మరణించారు..

చివరిసారిగా గతేడాది ఒకే రోజు 2,208 కేసులు నమోదు కాగా.. దాదాపుగా 149 రోజుల తర్వాత 1,890 కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,433గా ఉంది. డైలీ పాజిటివిటీ రేట్ 1.56 శాతంగా నమోదు అయింది. వీక్లీ పాజిటివిటీ రేట్ 1.29 శాతంగా ఉంది. దేశంలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.47 కోట్లు(4,47,04,147)గా కేసులు నమోదు అయ్యాయి. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య ,41,63,883కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్ ద్వారా 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందించింది..

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 12:21

MLA Undavalli Sridevi Pressmeet Live: ఉండవల్లి శ్రీదేవి సంచలన ప్రెస్ మీట్..

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన కామెంట్లు చేశారు. గత మూడు రోజులు గా వైసీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారు..నేను అజ్ఞాతం లో ఉన్నానని అంటున్నారు..

మొన్న డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ లాగా నన్ను చంపుతారు అని అజ్ఞాతం లోకి వెళ్ళాను. వాళ్ళ దందాలకు నేను అడ్డు వస్తున్నాను అని ఇలా చేస్తున్నారు అన్నారు ఉండవల్లి శ్రీదేవి.

నేను ఓటు వేసే టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా? లేదా సీసీ కెమెరా పెట్టారా?నేను ఓటు వేసే ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు. మిగతా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు అనుమానం పడట్లేదు. నన్ను ఎందుకు వేధిస్తున్నారు? నన్ను పిచ్చి కుక్క లాగా నిందవేసి బయటకు పంపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు..

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 12:18

సిట్ విచారణకు బండి సంజయ్ లీగల్ టీం

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో సిట్ నోటీసులకు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా సిట్ ముందు హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. తనకు సిట్ పై నమ్మకం లేదని బండి సంజయ్.. పేపర్ లీక్ కేసును తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

తనకు వచ్చిన సమాచారాన్ని బహిర్గతం చేయనని చెప్పారు. అసలు విషయంపై విచారణ జరపకుండా సిట్ అధికారులు తమకు నోటీసులిచ్చారని అన్నారు. మార్చి 26న సిట్ విచారణకు బండి సంజయ్ లీగల్ టీం హాజరుకానుంది.

మరో వైపు పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితులను రెండోసారి కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచింది. ఏ -1 ప్రవీణ్, ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య, ఏ -5 కేతావత్ రాజేశ్వర్ ను కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. సిట్ అధికారులు మూడు రోజుల పాటు నలుగురు నిందితులను విచారించనున్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 11:53

పాలు లేకుండా చాయ్..

•ఈ చాయ్‌‌ని పాలు పోయకుండా తయారు

•కానీ అక్షరాలా రూ.1000కి ఒక కప్పు చాయ్ గురించి విన్నారా?

హైదరాబాద్​ సిటీ.. చాయ్​కి ఎంతో ఫేమస్. గల్లీగల్లీకో టీ స్టాల్ ఉంటుంది. ఇరానీ చాయ్ తో పాటు ఎన్నో రకాల టీలను సిటీలో రుచి చూడొచ్చు. మాములుగా అయితే రూ.10 నుంచి రూ. 20కి సింగిల్ టీ దొరుకుతుంది. కానీ అక్షరాలా రూ.1000కి ఒక కప్పు చాయ్ గురించి విన్నారా?

ఈ టీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉందంటున్నారు తయారీదారులు. సిటీలో రెండు చోట్ల మాత్రమే ఈ అరుదైన కాస్ట్​లీ చాయ్​ అందుబాటులో ఉంది. కేఫ్ నిలోఫర్ బ్రాంచుల్లో మాత్రమే.. సిటీలోని బంజారాహిల్స్, హిమాయత్​నగర్‌‌‌‌ లోని కేఫ్ నిలోఫర్ ప్రీమియం లాంజ్‌‌లలో ఈ కాస్ట్​లీ చాయ్​ను టేస్ట్ చేయొచ్చు. ఈ ప్రత్యేకమైన చాయ్​ని రూ.వెయ్యికి ఒక కప్పు చొప్పున అమ్ముతున్నారు.

అంత రేటున్నా జనాలు కొని తాగుతున్నారంటే టేస్ట్‌‌ ఏ లెవెల్‌‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2021 నుంచి సిటీలోని ఈ రెండు బ్రాంచుల్లో ఈ చాయ్​ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో వాడే టీ పౌడర్‌‌‌‌లోనే ఉంది అసలు కథంతా. ఈ టీ పొడి ధరే కిలోకి లక్షన్నర. అది కూడా అంత ఈజీగా దొరకదు. వేలంలో పాల్గొని దక్కించుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఏడాది ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.